కరోనా సెకెండ్ వేవ్..రాబోయే 4 వారాలు అత్యంత కీలకం: డాక్టర్ వీకే పాల్
- April 06, 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ఉందనీ... సెకండ్ వేవ్లో కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోందని నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ మహమ్మారిని నియంత్రించగలమని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. ''దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. గతంలో కంటే ఈ సారి మహమ్మారి తీవ్రస్థాయిలో ఉంది. కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ... మనం ఈ మహమ్మారిని నియంత్రించగలం..'' అని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో వచ్చే నాలుగు వారాలూ అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్స్కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కరనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 'జన్ భగీందరీ', 'జన్ ఆందోళన్'కు పిలుపునిచ్చినట్టు ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!







