చెన్నైలో ఓటేసిన తెలంగాణ గవర్నర్

- April 06, 2021 , by Maagulf
చెన్నైలో ఓటేసిన తెలంగాణ గవర్నర్

సొంత రాష్ట్రం తమిళనాడు ఎన్నికల్లో తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుంబాగం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆమెతో పాటు భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అనంతరం అక్కడి నుంచి పుదుచ్చేరి చేరుకుని... అక్కడి పోలింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com