ఒమాన్ లో ఘొర రోడ్డు ప్రమాదం 18 మంది మృతి 14 మందికి తీవ్ర గాయాలు
- March 01, 2016
ఒమాన్ లో ఒక ప్రయాణికుల బస్సు , ట్రక్కు , కారులు ఒక దానితో ఒకటి ' ఢి ' కొనిన సంఘటనలో 18 మంది మృతి చెందగా మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఒక సలాలహ్ - దుబాయ్ ప్రయాణీకుల బస్సు ఫాహుద్ మరియు ఇబ్రి లను కలిపే రహదారి మీద ప్రయాణిస్తుండగా ఒక ట్రక్ మరియు కారు డీకొట్టడంతో పద్దెనిమిది మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఆరు ఓమనియులు , నలుగురు సౌదీ జాతీయులు , ఇద్దరు పాకిస్థానీయులు కాగా మరొకరు ఒకటి యెమెన్ దేశానికి చెందిన వారుగా పేర్కొంటున్నారు. చనిపోయిన మిగిలిన ఐదుగురు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







