ఎయిర్లైన్లకు మినిస్ట్రీ కీలక ఆదేశాలు!
- April 08, 2021
న్యూఢిల్లీ: గతేడాది లాక్డౌన్ సమయంలో క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి.. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. ఇటీవల ఇదే విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రద్దు అయిన విమాన సర్వీసులకు సంబంధించిన డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది. దాంతో గో ఎయిర్, ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశాయి. కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇంకా ప్రయాణికులకు రిఫండ్ చేయలేదు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ బుధవారం విమానయాన సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లాక్డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన డబ్బులను వెంటనే ప్రయాణికులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







