బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి
- April 08, 2021
బహ్రెయిన్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీకి ఘన స్వాగతం పలికారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు డాక్టర్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ. ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతితో పలు అంశాలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. భారత ఉప రాష్ట్రపతి, బహ్రెయిన్ నాయకత్వం కరోనా పాండమిక్ సమయంలో అక్కడి భారత ప్రజలకు అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. భారత్ - బహ్రెయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పరచడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనీ, పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఇరువు నాయకులు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









