ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తేనే వీసా పునరుద్ధరణ
- March 02, 2016
ముందు ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన అన్ని జరిమానాల బకాయిలను చెల్లిస్తేనే విదేశీయులకు వీసా పునరుద్ధరణ ఉంటుందని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బకాయిలు పడిన విదేశీయులకు అవి చెల్లించిన తర్వాతే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. జూన్ 1, 2015 నుండి విదేశీయులకు ఎవరైనా దేశం విడిచి వెళ్లడానికి ముందు కొంతకాలంగా ఆగిపోయి ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం తప్పనిసరి చేయబడింది. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించనివారు వేరే ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలు లేదు. గతంలోనే ఈ చర్య మొదలైనప్పటికి ప్రస్తుతం ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఒక ప్రజా సంబంధాల అధికారి తన కంపినీలో ఉద్యోగికి రెండేళ్ళ నివాస ముద్రను కేవలం పాత ట్రాఫిక్ జరిమానాను చెల్లించనందున పాస్ పోర్ట్ అధికారులు, రాయల్ ఒమన్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఫైసల్ అల్ వహాబీ మాట్లాడుతూ ఉద్యోగ పాస్ పోర్ట్ , గుర్తింపు కార్డులు, వీసాలు, నివాసం మరియు డ్రైవింగ్ కు రహదారి అనుమతులకు సంబంధించిన పలు సేవల పరిధి ఇందులో భాగంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







