షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తి అరెస్ట్
- April 09, 2021దోహా: అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా షాపుల్లోకి చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఖతార్ పోలీసులు వెల్లడించారు. పారిశ్రామిక ప్రాంతంలోని పలు షాపుల్లో వరుసగా చోరీలు జరుగుతుండటం..తెల్లవారే సరికి డబ్బులు, ఇతర విలువైన వస్తువులు కనిపించకపోవటం కొన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని షాపు ఓనర్లు కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ చోరీలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు అవసరమైన అనుమతులు తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించటంతో మొత్తం వ్యవహారం బయటపడింది. తన వద్ద ఉన్న పరికరాలతో అర్ధరాత్రి వేళల్లో షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువులు చోరీ చేసేవాడినని...చోరీలకు అవసరమైన పనిముట్లను కూడా పోలీసులకు చూపిస్తూ నేరం అంగీకరించాడు. దీంతో చోరీలకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..