ఓట్స్ తో ఇడ్లి..
- April 09, 2021
రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్.దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది.ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్ – 1 కప్పు
చిలికిన పెరుగు కావాల్సినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినప్పప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – 1 / 2 టీ స్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
అల్లం ముక్క – 1 (తరిగినది)
క్యారెట్ – 1 (తురిమినది)
కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
ఉప్పు రుచికి సరిపడా
నీరు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి. ఇంతలో గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించేయాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు చూసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇడ్లి స్టాండ్ లో ఆ పిండి ని ఇడ్లి లా వేసుకుని గ్యాస్ స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అయితే ఈ ఇడ్లిని విజిల్ లేకుండా ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ.. నచ్చిన చెట్నీతో తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









