ఒమన్ ఆసుపత్రుల్లలో శస్త్ర చికిత్సల వాయిదా
- April 09, 2021మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, శస్త్ర చికిత్సల విషయమై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని ఆసుపత్రుల్లోనూ శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు ఇది వర్తిస్తుంది. సర్జికల్ అలాగే నాన్ సర్జికల్ ఆపరేషన్స్ విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుంది. సిజేరియన్లు, షెడ్యూల్డ్ ఫెర్టిలైజేషన్ శస్త్ర చికిత్సల్ని అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి వుంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ