కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 350 మందిపై కేసులు
- April 12, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునే దిశగా తనిఖీల్ని మరింత ముమ్మరం చేశారు. తాజాగా 369 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 216 మంది ఫేస్ మాస్కులు ధరించలేదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించడానికి సంబంధించి 13 మందిపై కేసులు బుక్ చేయడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినవారు కాకపోతే, ఓ వాహనంలో డ్రైవర్ సహా నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు కరోనా నేపథ్యంలో. కాగా, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 138 మందిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లోడ్ చేసుకోనందుకుగాను ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటిదాకా వేలాదిమందిపై ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పాటించాలనీ, పాటించనివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు









