కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 350 మందిపై కేసులు
- April 12, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునే దిశగా తనిఖీల్ని మరింత ముమ్మరం చేశారు. తాజాగా 369 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 216 మంది ఫేస్ మాస్కులు ధరించలేదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించడానికి సంబంధించి 13 మందిపై కేసులు బుక్ చేయడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినవారు కాకపోతే, ఓ వాహనంలో డ్రైవర్ సహా నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు కరోనా నేపథ్యంలో. కాగా, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 138 మందిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లోడ్ చేసుకోనందుకుగాను ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటిదాకా వేలాదిమందిపై ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పాటించాలనీ, పాటించనివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







