నకిలీ ఉత్పత్తుల అమ్మకాలతో పలు సోషల్ మీడియా అకౌంట్ల మూసివేత
- April 14, 2021
యూఏఈ: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై యూఏఈ చర్యలు తీసుకుంది. నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అకౌంట్లను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్లను ఆర్ధిక మంత్రిత్వ శాక తనిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోసపూరితమైనవని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జరిమానాలను జారీ చేసింది. ఇక గతేడాదిలో 70 వేల అకౌంట్లపై నిఘా వేసి వాటి ప్రామాణికతను పరిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా నకిలీ ఉత్పత్తల అమ్మకాలు జరుగుతున్నట్లు తేల్చింది. ఎవరైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









