నకిలీ ఉత్పత్తుల అమ్మకాలతో పలు సోషల్ మీడియా అకౌంట్ల మూసివేత
- April 14, 2021
యూఏఈ: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై యూఏఈ చర్యలు తీసుకుంది. నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అకౌంట్లను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్లను ఆర్ధిక మంత్రిత్వ శాక తనిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోసపూరితమైనవని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జరిమానాలను జారీ చేసింది. ఇక గతేడాదిలో 70 వేల అకౌంట్లపై నిఘా వేసి వాటి ప్రామాణికతను పరిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా నకిలీ ఉత్పత్తల అమ్మకాలు జరుగుతున్నట్లు తేల్చింది. ఎవరైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







