నకిలీ ఉత్పత్తుల అమ్మకాలతో పలు సోషల్ మీడియా అకౌంట్ల మూసివేత
- April 14, 2021యూఏఈ: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై యూఏఈ చర్యలు తీసుకుంది. నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అకౌంట్లను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్లను ఆర్ధిక మంత్రిత్వ శాక తనిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోసపూరితమైనవని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జరిమానాలను జారీ చేసింది. ఇక గతేడాదిలో 70 వేల అకౌంట్లపై నిఘా వేసి వాటి ప్రామాణికతను పరిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా నకిలీ ఉత్పత్తల అమ్మకాలు జరుగుతున్నట్లు తేల్చింది. ఎవరైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..