నకిలీ ఉత్పత్తుల అమ్మకాలతో పలు సోషల్ మీడియా అకౌంట్ల మూసివేత
- April 14, 2021
యూఏఈ: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై యూఏఈ చర్యలు తీసుకుంది. నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అకౌంట్లను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్లను ఆర్ధిక మంత్రిత్వ శాక తనిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోసపూరితమైనవని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జరిమానాలను జారీ చేసింది. ఇక గతేడాదిలో 70 వేల అకౌంట్లపై నిఘా వేసి వాటి ప్రామాణికతను పరిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా నకిలీ ఉత్పత్తల అమ్మకాలు జరుగుతున్నట్లు తేల్చింది. ఎవరైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







