నకిలీ ఉత్పత్తుల అమ్మకాలతో పలు సోషల్ మీడియా అకౌంట్ల మూసివేత
- April 14, 2021యూఏఈ: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై యూఏఈ చర్యలు తీసుకుంది. నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అకౌంట్లను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 727 అకౌంట్లను ఆర్ధిక మంత్రిత్వ శాక తనిఖీ చేసింది. అందులో 334 ఖాతాలు మోసపూరితమైనవని నిర్ధారించింది. వీటికి సంబంధించి 129 జరిమానాలను జారీ చేసింది. ఇక గతేడాదిలో 70 వేల అకౌంట్లపై నిఘా వేసి వాటి ప్రామాణికతను పరిశీలించింది. అందులో 997 అకౌంట్ల ద్వారా నకిలీ ఉత్పత్తల అమ్మకాలు జరుగుతున్నట్లు తేల్చింది. ఎవరైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8001222 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ