మూడు రోజుల షర్మిల నిరాహార దీక్ష..ఒక్కరోజు మాత్రమే అనుమతి మంజూరు!!
- April 14, 2021వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పిన విధంగానే ఆమె నిరాహార దీక్షకు దిగబోతున్నారు.
అయితే, ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కరోజు మాత్రమే అదీకూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు. దీంతో టెన్షన్ లోటస్ పాండ్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మరి షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా లేదంటే ఒక్కరోజు మాత్రమే చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..