ఏపీలో కరోనా అప్డేట్

- April 14, 2021 , by Maagulf
ఏపీలో కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుంది.వైరస్‌ బారినపడుతున్న వారి రోజురోజుకు పెరుగుతోంది.కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 35,732 టెస్టులు చేయగా.. 4,157 కేసులు వెలుగుచూశాయి.తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049కు చేరింది.కొత్తగా కరోనా కారణంగా నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురు చొప్పున, విశాఖలో ఇద్దరు బాధితులు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.

24 గంటల వ్యవధిలో కొత్తగా 1,606 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 9,01,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు వెలుగుచూశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com