మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలకు పరిమితి
- April 14, 2021
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం తరావీహ్ ప్రార్థనల కోసం మసీదుల్లోకి పురుషులకు అనుమతినిస్తోంది పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో. అయితే, తరావీహ్ ప్రార్థనల కోసం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. కాగా, కువైట్ జనాభా మొత్తం 4.7 మిలియన్లు కాగా, ఇప్పటివరకు 248,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,412 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. ఇషా (సాయంత్రం) ప్రార్థనల తర్వాత తరావీహ్ కోసం రోజుకి 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రార్థన తర్వాత మసీదులు మూసివేయడం జరుగుతుది. మసీదులు మరియు బహిరంగ ప్రాంతాల్లో ఇఫ్తార్, సుహుర్ వంటివాటిని బ్యాన్ చేయడం జరిగింది. జనం గుమికూడకుండా ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం అనుమతినిచ్చారు. కాగా, ఏప్రిల్ 22 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుఝామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









