మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలకు పరిమితి
- April 14, 2021
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం తరావీహ్ ప్రార్థనల కోసం మసీదుల్లోకి పురుషులకు అనుమతినిస్తోంది పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో. అయితే, తరావీహ్ ప్రార్థనల కోసం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. కాగా, కువైట్ జనాభా మొత్తం 4.7 మిలియన్లు కాగా, ఇప్పటివరకు 248,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,412 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. ఇషా (సాయంత్రం) ప్రార్థనల తర్వాత తరావీహ్ కోసం రోజుకి 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రార్థన తర్వాత మసీదులు మూసివేయడం జరుగుతుది. మసీదులు మరియు బహిరంగ ప్రాంతాల్లో ఇఫ్తార్, సుహుర్ వంటివాటిని బ్యాన్ చేయడం జరిగింది. జనం గుమికూడకుండా ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం అనుమతినిచ్చారు. కాగా, ఏప్రిల్ 22 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుఝామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!







