రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు మరో ఛాన్స్!
- April 16, 2021
కువైట్ సిటీ: రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం వారి రెసిడెన్సీ స్టేటస్ను మార్చుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది.మే 15 లోపు గడువు ముగిసిన రెసిడెన్సీలను పునరుద్ధరించుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.ఈ మేరకు అంతర్గత మంత్రి షేక్ థామెర్ అల్ అలీ కీలక ప్రకటన చేశారు.గడువు ముగిసిన దేశంలో అక్రమంగా ఉంటున్నవారు,రెసిడెన్సీని రెన్యూవ్ చేయని ప్రవాసులు ఈ కొత్త గడువులోపు తమ రెసిడెన్సీ స్టేటస్ను మార్చుకోవాలని మంత్రి తెలిపారు.దీనికోసం ఈ నెల 15తో ముగిసిన గడువును నెల రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ గడువులోపు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు, తమ స్టేటస్ను మార్చుకోని వారి పట్ల జరిమానాలతో పాటు చట్టబద్దంగా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.అలాంటి వారికి రెసిడెన్సీ పర్మిట్లు రద్దు చేయడం,దేశం నుంచి బహిష్కరించడంతో పాటు ఎప్పటికీ తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా చేయడం లాంటి శిక్షలు ఉంటాయన్నారు.కనుక రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి షేక్ థామెర్ అల్ అలీ తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







