రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు మరో ఛాన్స్!
- April 16, 2021
కువైట్ సిటీ: రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం వారి రెసిడెన్సీ స్టేటస్ను మార్చుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది.మే 15 లోపు గడువు ముగిసిన రెసిడెన్సీలను పునరుద్ధరించుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.ఈ మేరకు అంతర్గత మంత్రి షేక్ థామెర్ అల్ అలీ కీలక ప్రకటన చేశారు.గడువు ముగిసిన దేశంలో అక్రమంగా ఉంటున్నవారు,రెసిడెన్సీని రెన్యూవ్ చేయని ప్రవాసులు ఈ కొత్త గడువులోపు తమ రెసిడెన్సీ స్టేటస్ను మార్చుకోవాలని మంత్రి తెలిపారు.దీనికోసం ఈ నెల 15తో ముగిసిన గడువును నెల రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ గడువులోపు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు, తమ స్టేటస్ను మార్చుకోని వారి పట్ల జరిమానాలతో పాటు చట్టబద్దంగా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.అలాంటి వారికి రెసిడెన్సీ పర్మిట్లు రద్దు చేయడం,దేశం నుంచి బహిష్కరించడంతో పాటు ఎప్పటికీ తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా చేయడం లాంటి శిక్షలు ఉంటాయన్నారు.కనుక రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి షేక్ థామెర్ అల్ అలీ తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









