చేపనూనెతో జ్ఞాపకశక్తి!
- March 02, 2016
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడం, ఆహారం తీసుకోకపోవడం, మాటలు అర్థం చేసుకోలేకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉంటే అల్జీమర్స్ వ్యాధిగా భావించాలి. క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా ఉంటే అల్జీమర్స్తో పోరాడవచ్చునని అంటున్నారు.చెక్ రిపబ్లిక్లోని ఫిజియాలజీ సీఏఎస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేశారు. చేప నూనెలో అల్జీమర్స్ వ్యాధి కారక లక్షణాలను నిరోధించే గుణం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల కన్నా చేప నూనెతో చేసి ఆహార పదార్థాలను తినడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలున్న ఎలుకలకు మూడు వారాల పాటు చేప నూనెతో వండిన ఆహారాన్ని అందజేశారు. ఇటువంటి ఆహారాన్ని తినని ఎలుకలతో పోల్చితే వీటి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు పరిశోధకులు తేల్చారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







