చేపనూనెతో జ్ఞాపకశక్తి!
- March 02, 2016
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడం, ఆహారం తీసుకోకపోవడం, మాటలు అర్థం చేసుకోలేకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉంటే అల్జీమర్స్ వ్యాధిగా భావించాలి. క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా ఉంటే అల్జీమర్స్తో పోరాడవచ్చునని అంటున్నారు.చెక్ రిపబ్లిక్లోని ఫిజియాలజీ సీఏఎస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేశారు. చేప నూనెలో అల్జీమర్స్ వ్యాధి కారక లక్షణాలను నిరోధించే గుణం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల కన్నా చేప నూనెతో చేసి ఆహార పదార్థాలను తినడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలున్న ఎలుకలకు మూడు వారాల పాటు చేప నూనెతో వండిన ఆహారాన్ని అందజేశారు. ఇటువంటి ఆహారాన్ని తినని ఎలుకలతో పోల్చితే వీటి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు పరిశోధకులు తేల్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









