స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 320 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
- April 18, 2021
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కోచ్, అసిస్టెంట్ కోచ్ విభాగాల్లో దాదాపు 320 ఖాళీల భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో కోచ్ పోస్టులు 100, అసిస్టెంట్ కోచ్ పోస్టులు 220 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20లోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000-రూ. 1,50,000 వరకు వేతనం చెల్లించనున్నారు. అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.41,420 వేల నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
విద్యార్హతల వివరాలు..
కోచ్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన ఇతర ఏ ఇండియన్/ఫారెన్ యూనివర్సిటీలో కోచింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఒలంపిగ్ గేమ్స్ లో మెడల్ విన్నర్ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత లేదా ఒలంపిక్ లో రెండు సార్లు పాల్గొన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అసిస్టెంట్ కోచ్: SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోచింగ్ లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఒలంపిక్ లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారు లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
వయో పరిమితి:
కోచ్: 45 ఏళ్లు
అసిస్టెంట్ కోచ్-40 ఏళ్లు
Official Website- https://sportsauthorityofindia.nic.in/
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు అధికారిక వెబ్ సైట్లో ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే ఏప్రిల్ 20 వ తేదీ నుంచి అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండనుంది. అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







