మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్
- April 19, 2021
న్యూ ఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 కు టీకాలు వేయడానికి అర్హులేనని అని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది, కరోనా వ్యాక్సిన్ సరళీకృత మరియు వేగవంతమైన దశ 3 గా దీనిని చెబుతున్నారు.ముందు మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. తరువాత 45 ఏళ్ళ వారికి ఇచ్చారు. అయితే కరోన కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిన్చేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. దీంతో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యాక్సిన్ తయారీదారులు తమ సరఫరాలో 50% వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధం అయితే మిగతాది ఓపెన్ మార్కెట్ లో ముందే నిర్ణయించిన రేటుకు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









