17 మంది డొమస్టిక్ కార్మికుల అరెస్ట్
- April 20, 2021దుబాయ్: తమ యజమాని నుంచి చెప్పాపెట్టకుండ పారిపోయిన 17 మంది డొమస్టిక్ కార్మికులను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు.రమదాన్ మాసంలో నిర్వహించిన తనిఖీల్లో తొలి వారంలోనే ఈ 17 మంది పట్టుడినట్లు దుబాయ్ చొరబాటు నిరోధక విభాగం పోలీసులు వెల్లడించారు.తమ తనిఖీలు ఏడాది పొడగునా ఉంటాయని హెచ్చరించారు.ఎవరైనా డొమస్టిక్ కార్మికులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పారిపోతే సదరు యజమాని వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ఒప్పందం కుదర్చుకున్న యజమాని దగ్గర పని చేయకుండా పారిపోతున్న డొమస్టిక్ కార్మికులతో సమాజానికి భద్రాతపరమైన చిక్కులు ఏర్పడే సమస్యలు ఉన్నాయని వారు వివరించారు.అసలు యజమానికి దగ్గర్నుంచి పారిపోయే కార్మికులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు వేరే పేరుతో గంటల లెక్కన మరో ఇంట్లో పనికి కుదిరుతున్నారని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన