తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు..
- April 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది.అయినా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లోకర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.
కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్లు, మీడియాకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







