తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు..
- April 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది.అయినా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లోకర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.
కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్లు, మీడియాకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







