కరోనా పేషెంట్ను బంధించిన హాస్పిటల్ యాజమాన్యం
- April 20, 2021హైదరాబాద్: బేగంపేట్లోని విన్ హాస్పిటల్ యాజమాన్యం డబ్బుల కోసం కరోనా రోగిని బంధించిన వైనం వెలుగుచూసింది.నాలుగు లక్షలు కడితే డిశ్చార్జీ చేస్తామని విన్ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని కోవిడ్ పేషెంట్ రామారావు ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసాడు. కరోనా పాజిటివ్తో ఈనెల 1న బేగంపేట్ విన్ ఆస్పత్రిలో చేరాడు.అయితే తనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే క్లయిమ్ చేసుకుంటామని వైద్యులు చెప్పారని రామారావు అంటున్నాడు.కోవిడ్ కోసం అడ్మిట్ అయితే అనవసరమైన టెస్టుల చేసి నాలుగు లక్షల రూపాయలు బిల్లు చేసారని ఆరోపించాడు.కనీసం గుండె జబ్బు ఉందని ప్రాధేయ పడినా యాజమాన్యం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ కోవిడ్ పేషెంట్ రామారావు బంధువులు.. మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఫిర్యాదు చేసారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు