200 మంది ఉగ్రవాదులు మృతి

- April 20, 2021 , by Maagulf
200 మంది ఉగ్రవాదులు మృతి

మాస్కో: సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా జరిపిన దాడిలో సుమారు 200 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది.ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయని,మరో అర టన్ను పేలుడు పదార్ధాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొంది. సిరియా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగినట్లు రష్యా అడ్మిరల్‌ అలక్సందర్‌ కార్పొవ్‌ దృవీకరించారు.సిరియాకు ఈశాన్యంలో ఉన్న పల్మైరాలో పలు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని.. ఇక్కడ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని అన్నారు.ఇక్కడ అక్రమంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతం సిరియా ఆధీనంలో లేదని రష్యా ఆర్మీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com