కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
- April 21, 2021తెలంగాణ: భద్రాద్రి రాముడి కల్యాణం కన్నుల పండువగా సాగింది.ఏటా మిథిలా స్టేడియంలో నిర్వహించే రామయ్య కల్యాణాన్ని కరోనా కారణంగా నిత్యకల్యాణ మండపంలో జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు.భక్త రామదాసు స్వయంగా చేయించిన దివ్యాభరణాలను సీతారాముల స్వర్ణ మూర్తులను అందంగా అలంకరించారు.శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి.. ఆలయ ప్రాంగణంలో బేడా మండపంలో రామచంద్రమూర్తి, సీతమ్మలను అభిముఖంగా కూర్చోబెట్టారు. కొందరు అర్చకులు రామయ్య తరపున, మరికొందరు అర్చక స్వాములు సీతమ్మవారి తరపున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు.ఈ సమయంలో అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చినట్లుగా వర్ణించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ మాలా పరివర్తన కార్యక్రమాన్ని రమణీయంగా పూర్తిచేశారు.అనంతరం సీతారామచంద్రులను పక్క పక్కన ఆశీనులను చేసి ప్రత్యేక హారతి సమర్పించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..