5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని కంపెనీకి ఆదేశం

- April 21, 2021 , by Maagulf
5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని కంపెనీకి ఆదేశం

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఓ సెక్యూరిటీ కంపెనీకి 24 గంటల సమయమిచ్చింది స్కూల్ గార్డులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు. అథారిటీ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఓ స్కూల్ గార్డు, తనకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. సంబంధిత అధికారులు, ఈ ఘటనపై స్పందించారు. అధికారులు, ఆ గార్డు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు గార్డుతోపాటు మిగతా గార్డులకూ వేతనాలు అందలేదని గుర్తించి, కంపెనీ వెంటనే వేతన బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com