ఏప్రిల్ 28 నుంచి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

- April 22, 2021 , by Maagulf
ఏప్రిల్ 28 నుంచి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 28 వ తేదీ నుంచి కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది.కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు.ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు.అయితే,18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు.18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్రం స్పష్టం చేసింది.  ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు బుక్ చేస్తున్నాయి.కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఫ్రీగా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం విశేషం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com