శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- April 22, 2021 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.బుధవారం రాత్రి FZ-8779 విమానం ద్వారా దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 386 గ్రాముల బంగారం లభించింది.దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.19.1 లక్షలు ఉంటుందని చెప్పారు.బంగారాన్ని పేస్టు రూపంలో తరలిస్తున్నాడని తెలిపారు. అతడిని విచారణ నిమిత్తం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com