భారత్-కెనడా విమాన సర్వీసులు రద్దు
- April 23, 2021
టొరంటో: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.ఏకంగా భారత విమానాలపై నిషేదం విధిస్తున్నాయి.తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది.భారత్ నుంచి వచ్చే ప్యాసింజర్, కమర్షియల్ విమానాలను 30 రోజులపాటు నిషేదిస్తున్నట్లు కెనడా రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా ప్రకటించారు.భారత్ నుంచి కెనడాకు వస్తున్న విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా కరోనా కేసులను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.భారత్ తోపాటు పాకిస్థాన్ నుంచి వచ్చేవారిపైకి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసే విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
గత రెండు వారాల్లో కెనడాలోని టొరంటో,వాన్కోవర్కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వచ్చాయని,వారిలో ఒక్కో విమానంలో కనీసం ఒక్క ప్రయాణికుడైనా అనారోగ్యానికి గురైనట్లు ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.కాగా, కెనడాకు వచ్చే విదేశీ ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.ఆ దేశంలో ప్రస్తుతం మూడో విడుత కరోనా విజృంభణ కొనసాగుతోంది. కెనడా శుక్రవారం 9 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 11,51,276కు చేరింది. ఇందులో 23,812 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు కెనడా రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా తెలిపారు.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









