ఏపీ కరోనా అప్డేట్
- April 24, 2021
అమరావతి: ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు పదకొండు వేలు దాటిపోయాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,972 శాంపిల్స్ పరీక్షించగా 11,698 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్తో 37 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూర్ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరియు ప్రకాశం లో ఒక్కరు చొప్పున మరణించారు.ఇదే సమయంలో 4,421 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కు చేరగా.. యాక్టివ్ కేసులు 81,471గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 9,31,839 కరోనా నుంచి కోలుకోగా 7,616 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







