భారత్: కరోనా అప్డేట్

- April 25, 2021 , by Maagulf
భారత్: కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా కేంద్రం బులిటెన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో కొత్తగా 2,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది.ఇందులో 1,40,85,110 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 26,82,751 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 2767 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,92,311కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 2,17,113 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.రోజుకు లక్ష కేసులకు పైగా యాక్టివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించేఅంశం.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 14,09,16,417 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com