Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- April 25, 2021
దుబాయ్: దుబాయ్ లో ఓ ఉద్యోగిపై దాడి చేసి అతని నుంచి Dh4,300 మేర దోచుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన ఆసియా వ్యక్తి కోర్టు విచారణలో ఊరట లభించింది.వాదోపవాదాలు విన్న తర్వాత ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసు గత జనవరిలో పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఒకే ఇరుగు పొరుగు వారే. అయితే...చెత్త వేయటం విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు విచారణలో తేలింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం..ఆసియా వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరాడని, దీంతో తాను నిందితుడి ఇంటికి వెళ్లాలని..అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు ఆసియా వ్యక్తులు తనపై దాడి చేసి పారిపోయారని వివరించారు. ఆ తర్వాత చూసుకుంటే తన దగ్గర ఉన్న Dh4,300 డబ్బులు కనిపించలేదని, దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. అయితే..ఆ సొమ్మను ఆసియా వ్యక్తి తీశాడని కోర్టు ముందు రుజువు కాలేదు. దీంతో చోరీ కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







