Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- April 25, 2021
దుబాయ్: దుబాయ్ లో ఓ ఉద్యోగిపై దాడి చేసి అతని నుంచి Dh4,300 మేర దోచుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన ఆసియా వ్యక్తి కోర్టు విచారణలో ఊరట లభించింది.వాదోపవాదాలు విన్న తర్వాత ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసు గత జనవరిలో పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఒకే ఇరుగు పొరుగు వారే. అయితే...చెత్త వేయటం విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు విచారణలో తేలింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం..ఆసియా వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరాడని, దీంతో తాను నిందితుడి ఇంటికి వెళ్లాలని..అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు ఆసియా వ్యక్తులు తనపై దాడి చేసి పారిపోయారని వివరించారు. ఆ తర్వాత చూసుకుంటే తన దగ్గర ఉన్న Dh4,300 డబ్బులు కనిపించలేదని, దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. అయితే..ఆ సొమ్మను ఆసియా వ్యక్తి తీశాడని కోర్టు ముందు రుజువు కాలేదు. దీంతో చోరీ కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.
తాజా వార్తలు
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి









