కరోనా బీభత్సం.. లాక్‌డౌన్ పొడగింపు దిశగా కేజ్రీవాల్ సర్కార్

- April 25, 2021 , by Maagulf
కరోనా బీభత్సం.. లాక్‌డౌన్ పొడగింపు దిశగా కేజ్రీవాల్ సర్కార్

ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే ఈ క్రమంలో కొత్త వ్యాక్సిన్లు, మందులకు కూడా అత్యవసర వినియోగం కోసం అనుమతులు ఇస్తోంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయినా కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్యకు అధికంగా ఉంటోంది. కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతగా ఏర్పడింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com