భారత్‌కు రూ.135 కోట్ల సహాయం ప్రకటించిన గూగుల్ !

- April 26, 2021 , by Maagulf
భారత్‌కు రూ.135 కోట్ల సహాయం ప్రకటించిన గూగుల్ !

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా విలయం మామూలుగా లేదు.ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే..భారత్ మరింత డేంజర్ లో పడనుంది.ఇలాంటి సమయంలో భారత్ కు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది.ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్  పిచాయ్.కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు,యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇండియాకు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది.కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది.అలాగే ఇండియా కు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఒక అడుగు ముందుకు వేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com