అదునుచూసుకొని డిమాండ్ చేస్తున్న 108 సిబ్బంది
- April 28, 2021
హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 ఉద్యోగులు బుధవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 10 ఏళ్లుగా తమ వేతనాలు పెంచలేదని 108 ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు తమ సమస్యలను 10 ఏళ్లుగా పరిష్కరించడం లేదని వారు గుర్తు చేస్తున్నారు.
కరోనా విధుల్లో ప్రస్తుతం 108 సిబ్బంది కీలకంగా ఉన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తాము సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో ఒకవేళ 108 సిబ్బంది సమ్మెకు దిగితే రోగులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే ప్రైవేట్ అంబులెన్స్ లు కరోనా రోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









