అదునుచూసుకొని డిమాండ్ చేస్తున్న 108 సిబ్బంది

- April 28, 2021 , by Maagulf
అదునుచూసుకొని డిమాండ్ చేస్తున్న 108 సిబ్బంది

హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని  కోరుతూ 108 ఉద్యోగులు బుధవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 10 ఏళ్లుగా తమ వేతనాలు పెంచలేదని 108 ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు  తమ సమస్యలను 10 ఏళ్లుగా పరిష్కరించడం లేదని  వారు గుర్తు చేస్తున్నారు.

కరోనా విధుల్లో  ప్రస్తుతం 108 సిబ్బంది కీలకంగా ఉన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  తాము సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో  ఒకవేళ 108 సిబ్బంది సమ్మెకు దిగితే  రోగులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే ప్రైవేట్ అంబులెన్స్ లు  కరోనా రోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com