యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో ఘన విజయం

- March 03, 2016 , by Maagulf
యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో  ఘన విజయం

యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌తో మీర్పూర్‌ లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 82 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 10.1 ఓవర్లలో 82 రన్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ 39 పరుగులు చేసి నవేద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం వన్ డౌన్ లో వచ్చిన యువరాజ్ 14 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఒక సిక్సర్ సహాయంతో 25 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com