శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- April 29, 2021
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక కోటి 36 లక్షలు విలువ చేసే బంగారాన్ని గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి బంగారం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం EK-526 విమానం ద్వారా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేశారు.ఈ తనఖీలో ప్రయాణికుడి నుంచి 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు ఒక కోటి 36 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







