మహారాష్ట్రలో లాక్డౌన్ గడువు పొడిగింపు..
- April 30, 2021
ముంబై: భారత్ లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తిచెందుతోంది.కేసులు, మరణాల పరంగా దేశంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు వేలాదిగా పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. వైరస్ అదుపులోకి రావడంలేదు.ఈ మేరకు దాదాపు నెలనుంచి నైట్ కర్ఫ్యూను ఆ తర్వాత లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో లాక్డౌన్ ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 15 రోజుల పాటు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు మరో 15 రోజులపాటు కొనసాగుతాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం క్యాబినేట్ కూడా సమావేశమైంది. కాగా.. కరోనా విస్తృతి నేపథ్యంలో ఏప్రిల్ 21న బ్రేక్ ది చెయిన్ క్యాంపెయిన్ కింద రాష్ట్రవ్యాప్తంగా మే 1 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రేపటితో ఈ ఆంక్షల గడువు ముగుస్తున్న కారణంగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







