భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే విమానాలను నిషేధించాలి
- April 30, 2021
మనామా: భారత్లో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది.భారత్లో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని బహ్రెయిన్ ఎంపీలు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. అంతకంతకు కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాల కొరత ఏర్పడుతుండడం భారత్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుందని బహ్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వెంటనే భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై బ్యాన్ వేయాలని, అలాగే భారత ప్రయాణికులను కూడా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇప్పటికే బహ్రెయిన్.. భారత్ సహా మూడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ వచ్చే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు ప్రయాణానికి 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. కాగా, బహ్రెయిన్లో 4.5లక్షల నుంచి 5 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







