భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే విమానాలను నిషేధించాలి

- April 30, 2021 , by Maagulf
భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే విమానాలను నిషేధించాలి

మనామా: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది.భారత్‌లో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని బహ్రెయిన్ ఎంపీలు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. అంతకంతకు కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాల కొరత ఏర్పడుతుండడం భారత్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుందని బహ్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వెంటనే భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై బ్యాన్ వేయాలని, అలాగే భారత ప్రయాణికులను కూడా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇప్పటికే బహ్రెయిన్.. భారత్ సహా మూడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ వచ్చే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు ప్రయాణానికి 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. కాగా, బహ్రెయిన్‌లో 4.5లక్షల నుంచి 5 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com