ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేసేవారికి దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- May 01, 2021
దుబాయ్: రమదాన్ సందర్భంగా చివరి పది రోజుల్లో రాత్రి వేళ చేసే తహజ్జుద్ ప్రార్థనల విషయమై వాహనదారులు, భద్రతా పరంగా సరైన ప్రాంతాలను ఎంచుకోవాలని దుబాయ్ పోలీస్ సూచించడం జరిగింది. జనరల్ ట్రాఫిఖ్ డిపార్టుమెంట్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సైఫ్ ముహైర్ సయీద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పలువురు వ్యక్తులు రోడ్డు మీద, వీధుల్లో మసీదుల పక్కనే తమ వాహనాల్ని పార్కింగ్ చేస్తున్నారని అన్నారు. ఈ చర్యలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని చెప్పారాయన. ప్రార్థనలు నిర్వహించేవారికి కూడా ఇది ఇబ్బందికరమని అన్నారు. వాహనాల్ని పరిమిత వేగంతోనే మసీదుల వద్ద నడపాల్సిందిగా అల్ మజ్రోయి చెప్పారు. పోలీస్ పెట్రోల్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందనీ, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









