ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేసేవారికి దుబాయ్ పోలీస్ హెచ్చరిక

- May 01, 2021 , by Maagulf
ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేసేవారికి దుబాయ్ పోలీస్ హెచ్చరిక

దుబాయ్: రమదాన్ సందర్భంగా చివరి పది రోజుల్లో రాత్రి వేళ చేసే తహజ్జుద్ ప్రార్థనల విషయమై వాహనదారులు, భద్రతా పరంగా సరైన ప్రాంతాలను ఎంచుకోవాలని దుబాయ్ పోలీస్ సూచించడం జరిగింది. జనరల్ ట్రాఫిఖ్ డిపార్టుమెంట్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సైఫ్ ముహైర్ సయీద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పలువురు వ్యక్తులు రోడ్డు మీద, వీధుల్లో మసీదుల పక్కనే తమ వాహనాల్ని పార్కింగ్ చేస్తున్నారని అన్నారు. ఈ చర్యలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని చెప్పారాయన. ప్రార్థనలు నిర్వహించేవారికి కూడా ఇది ఇబ్బందికరమని అన్నారు. వాహనాల్ని పరిమిత వేగంతోనే మసీదుల వద్ద నడపాల్సిందిగా అల్ మజ్రోయి చెప్పారు. పోలీస్ పెట్రోల్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందనీ, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com