గాంధీ ఆస్పత్రికి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- May 02, 2021
హైదరాబాద్: కోవిడ్ రోగుల కోసం గాంధీ ఆస్పత్రికి డీఆర్డీవో నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో మిస్సైల్ డీజీ ఎమ్మెస్సార్ ప్రసాద్, గాంధీ సూపరిండెంట్ రాజారావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి తమకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని, డీఆర్డీవో నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమందిని కాపాడుకోగలుగుతామని రాజారావు అన్నారు. కిషన్ రెడ్డి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 650 ఐసీయూ పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా సేవలందిస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉండకూడదని సీఎస్ తో తాను మాట్లాడానని కేంద్ర మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







