వ్యాక్సిన్ తీసుకోకుంటే పౌరులను కూడా అనుమతించబోమన్న కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఆంక్షల తీవ్రతను పెంచుతూ వస్తోంది కువైట్. ప్రస్తుతానికైతే కువైట్ లో కోవిడ్ కేసుల తీవ్రత స్థిరంగానే ఉన్నా...భవిష్యత్తు ముప్పు నుంచి తప్పించుకునేందుకు పలు ముందస్తు జాగ్రత్తలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా కువైట్ వచ్చే పౌరులకు సంబంధించి కూడా కొత్త సూచనలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పౌరులు, వారి భార్య, భర్త, పిల్లలను కూడా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే పౌరులలో ఇళ్లలో పని చేసే గృహ కార్మికులకు కూడా పర్మిషన్ ఉండదని వెల్లడించింది.ఈ మేరకు మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త నిర్ణయాలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి.అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులైన వయసువారికి మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే దేశం విడిచి వెళ్లే వారు రోడ్డు, సముద్ర మార్గాల్లో వెళ్లొచ్చని, అదీ కూడా మూడు కేటగిరి వారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పశువులతో ఓడరేవుల దగ్గర సిద్ధంగా ఉన్నవారు, జీసీసీ దేశాల్లో ఆస్తులు ఉన్న వారు, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే వారు సముద్ర, రోడ్డు మార్గంలో దేశం విడిచి వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







