వ్యాక్సిన్ తీసుకోకుంటే పౌరులను కూడా అనుమతించబోమన్న కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఆంక్షల తీవ్రతను పెంచుతూ వస్తోంది కువైట్. ప్రస్తుతానికైతే కువైట్ లో కోవిడ్ కేసుల తీవ్రత స్థిరంగానే ఉన్నా...భవిష్యత్తు ముప్పు నుంచి తప్పించుకునేందుకు పలు ముందస్తు జాగ్రత్తలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా కువైట్ వచ్చే పౌరులకు సంబంధించి కూడా కొత్త సూచనలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పౌరులు, వారి భార్య, భర్త, పిల్లలను కూడా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే పౌరులలో ఇళ్లలో పని చేసే గృహ కార్మికులకు కూడా పర్మిషన్ ఉండదని వెల్లడించింది.ఈ మేరకు మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త నిర్ణయాలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి.అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులైన వయసువారికి మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే దేశం విడిచి వెళ్లే వారు రోడ్డు, సముద్ర మార్గాల్లో వెళ్లొచ్చని, అదీ కూడా మూడు కేటగిరి వారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పశువులతో ఓడరేవుల దగ్గర సిద్ధంగా ఉన్నవారు, జీసీసీ దేశాల్లో ఆస్తులు ఉన్న వారు, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే వారు సముద్ర, రోడ్డు మార్గంలో దేశం విడిచి వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!









