భారత్ కు బాసటగా నిలిచిన ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ
- May 04, 2021
దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమంతో ఖతార్ లోని భారతీయ సమాజం చలించింది. ఈ కష్ట సమయంలో మాతృదేశ పౌరులకు బాసటగా తమ వంతు సాయం అందించింది. కోవిడ్ పేషెంట్లకు అత్యవసరంగా మారిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రెట్లను పంపిస్తోంది. ప్రస్తుతం ఖతార్ లో ఉన్న భారత్ నేవీకి చెందిన నౌక ద్వారా 200 ఆక్సిజన్ సిలిండర్లు, 43 ఆక్సిజన్ కన్సంట్రెట్లను తరలిస్తోంది. ఈ మేరకు వైద్యసామాగ్రిని ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం- ఐసీబీఎఫ్కి అందించింది. సంక్షోభ సమయంలో మాతృదేశానికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఖతార్ ఇండియన్ కమ్యూనిటీకి ఐసీబీఎఫ్ ధన్యవాదాలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







