రెండు డోస్ ల మ‌ధ్య కాల‌ప‌రిమితిని పెంచిన కువైట్‌

- May 04, 2021 , by Maagulf
రెండు డోస్ ల మ‌ధ్య కాల‌ప‌రిమితిని పెంచిన కువైట్‌

కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మ‌ధ్య కాల‌ప‌రిమితిని పెంచుతూ కువైట్ నిర్ణ‌యం తీసుకుంది.బ‌యోన్టెక్ ఫైజ‌ర్ వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్న‌వారికి ఆరు వారాల త‌ర్వాతే రెండో డోసు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంత‌కు వ‌య‌సుపైబ‌డిన‌వారు...దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి మాత్రం మూడు వారాల త‌ర్వాత రెండో డోసు ఇవ్వ‌నున్నారు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజ‌ర్ బ‌యోన్టెక్ వ్యాక్సిన్ దిగుమ‌తిలో ఆల‌స్యం కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కువైట్ స్ప‌ష్టం చేసింది. మే 3న ఆ త‌ర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంద‌రికీ ఇదే నిబంధ‌న వ‌ర్తిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com