ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే లక్ష దిర్హామ్ ల జరిమానా
- May 07, 2021
యూఏఈ: మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కావాలని వైరస్ వ్యాప్తి చేసినట్లు నిరూపణ అయితే..50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా, గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తామని వెల్లడించింది. ఒక వేళ అదే తప్పును మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతుందని తెలిపింది. ఇదిలాఉంటే వైరస్ ఉన్నట్లు అనుమానం ఉన్నా, లక్షణాలు కనిపించినా ఆ విషయాన్ని అధికారులకు తెలియజేకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయటం కూడా తప్పేనని..అందుకు జైలు శిక్ష లేదా 10 వేల నుంచి 50 వేల దిర్హామ్ ల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









