ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే లక్ష దిర్హామ్ ల జరిమానా

- May 07, 2021 , by Maagulf
ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే లక్ష దిర్హామ్ ల జరిమానా

యూఏఈ: మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కావాలని వైరస్ వ్యాప్తి చేసినట్లు నిరూపణ అయితే..50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా, గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తామని వెల్లడించింది. ఒక వేళ అదే తప్పును మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతుందని తెలిపింది. ఇదిలాఉంటే వైరస్ ఉన్నట్లు అనుమానం ఉన్నా, లక్షణాలు కనిపించినా ఆ విషయాన్ని అధికారులకు తెలియజేకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయటం కూడా తప్పేనని..అందుకు జైలు శిక్ష లేదా 10 వేల నుంచి 50 వేల దిర్హామ్ ల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com