కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ బోటును ఢీ కొట్టిన పడవ..ముగ్గురు మృతి
- May 07, 2021
బహ్రెయిన్: అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు..తమ పడవతో కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ పడవను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారు కోస్ట్ గార్డ్ సిబ్బందిగా తెలుస్తోంది. షహ్రాఖాన్ బీచ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న వారిని నిలువరించేందుకు కోస్ట్ గార్డ్ టీం ప్రయత్నించింది. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు కోస్ట్ గార్డ్ బోటును తమ పడవతో ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన ఆసియన్లను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు పలు నిబంధనలు ఉల్లఘించారని, పడవ రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్ ను స్విచ్ఛాఫ్ చేయటం ఇలా పలు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









