కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు

- May 07, 2021 , by Maagulf
కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు

అమరావతి: కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్‌ పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది.ఇద్దరు కోవిడ్‌ పేషంట్లకు కలిపి ఓ రూమ్‌ను ఇవ్వనున్నారు అధికారులు.అదేవిధంగా కోవిడ్‌ పేషెంట్లకు ఫ్రీ చెకప్‌, ఫ్రీ మెడిసిన్‌తోపాటు ఫ్రీ ఫుడ్‌ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.ఇక హోం ఐసోలేషన్‌ సెంటర్లలో జాయిన్‌ అవ్వడానికి మొదట 104కి కాల్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోవిడ్‌ పేషెంట్లకు అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com