రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు వెల్లడించిన పోలీసులు
- May 09, 2021
అబుధాబి: అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం, అతి వేగం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అబుధాబి పోలీసులు అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ప్రధాన కారణాలను వివరించారు. రోడ్డుపై వాహనాలను నడుపుతున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాటలు వింటూ డ్యాన్సులతో డ్రైవ్ చేయటం, మొబైల్ ఫోన్లో మాట్లాడటం, తినడం, త్రాగటం, సోషల్ మీడియాలో మునిగిపోయి డ్రైవింగ్ పై ధ్యాస లేకుండా పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే డ్రైవింగ్ సమయంలో ఫోటోలు తీయడం, మేకప్ ఫిక్సింగ్ చేయడం, దుస్తులు సర్దుబాటు చేసుకుంటూ స్టీరింగ్ పై పట్టు కొల్పోతున్నారని, అలాంటి సమయాల్లోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు









