హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్
- May 09, 2021
చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్-5 బీ’ ఎక్కడ పడుతుందో, ఎంత నష్టం కలిగిస్తుందోనని ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఇప్పుడా భయం లేదు. ఇది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, ఆదివారం ఉదయం హిందూమహాసముద్రంలో కూలిపోయిందని చైనా ప్రకటించింది. 18 టన్నుల ఈ భారీ రాకెట్ కథ ముగిసింది. ఏప్రిల్ 29 న దీన్ని చైనా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇప్పుడు ఇది హిందూ మహాసముద్రంలో కూలింది గనుక దీని శిథిల భాగాల నుంచి కూడా ముప్పు ఉండదని బీజింగ్ లోని అధికారులు తెలిపారు. మే 9 న తెల్లవారుజామున ఈ రాకెట్ మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశించింది. మాల్దీవుల సమీపంలో ఈ మహా సముద్రంలో కూలింది. దీని శిథిల భాగాలు రీ-ఎంట్రీ సమయంలోనే నాశనమయ్యాయి అని వారు వివరించారు. అమెరికా మిలిటరీ డేటాను వినియోగించుకునే స్పేస్ ట్రాక్-కూడా దీని రీ-ఎంట్రీని ధృవీకరించింది. లాంగ్ మార్చ్ 5 బీ వ్యవహారం ముగిసింది గనుక ప్రతివారూ రిలాక్స్ గా ఉండవచ్చునని , ‘రాకెట్ ఈజ్ డౌన్’ అని స్పేస్ ట్రాక్ ట్వీట్ చేసింది.
నిజానికి ఈ భారీ రాకెట్ ఎంత ప్రాణ, ఆస్తి నష్టం కలుగజేస్తుందోనని అంతా భయపడ్డారు. దీని స్టాస్టిటికల్ ఛాన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ భయం మాత్రం తగ్గలేదు. అమెరికన్, యూరోపియన్ అంతరిక్ష పరిశోధకులు ఇది ఎక్కడ పడుతుందోనని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వచ్చారు. దీన్ని పేల్చివేసి కిందకు కూల్చాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఇది కక్ష్య నుంచి కింద పడకుండా చూడడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. గత ఏడాది లాంగ్ మార్చ్ రాకెట్ కి చెందిన మరో రాకెట్ ఐవోరీ కోస్ట్ లోని కొన్ని గ్రామాలపై పడింది. అప్పుడు ఆస్తి నష్టం జరిగింది గానీ ఎవరూ గాయపడలేదు.. మరణించలేదు కూడా..
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







